గోరఖ్పూర్: ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు యోగి గోరఖ్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శాసన సభ ఎన్నికల్లో యోగి పోటీ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఆయన ఐదుసార్లు గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న తొలిదశ ఎన్నిక జరగనుండగా.. మార్చి 7న తుది విడత పోలింగ్ జరగనుంది. గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గంలో మార్చి 3న ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022