లక్నో: ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచిప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 17 కార్పొరేషన్లలో బీజేపీ విజయం సాధించింది.
97మున్సిపాటిలీటీల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. ఎస్పీ 37, బీఎస్పీ 19, కాంగ్రెస్ 4, ఇతరులు 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 544 నగర పంచాయతీల్లో 195 నగర పంచాయతీల్లో కమల దళం సత్తా చాటుతోంది. ఎస్పీ 80, బీఎస్పీ 42, కాంగ్రెస్ 7, ఇతరులు 169 నగర పంచాయతీల్లో ముందున్నారు.
ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని స్వాగతించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషితో, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంతో మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఇదే అతిపెద్ద విజయమన్నారు.