పసరు మందు తాగి కాసేపటికే మృతి

పసరు మందు తాగి కాసేపటికే మృతి

ములకలపల్లి, వెలుగు: నాటు వైద్యం వికటించి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన గుగులోత్​హతీరామ్(23) ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​లో డైలీ లేబర్. మద్యానికి బానిసై ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఎలాగైనా అతనితో తాగుడు మాన్పించాలని కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన నాటు వైద్యుడిని సంప్రదించారు. మంగళవారం హతీరామ్​తో పసరు మందు తాగించగా కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.