గంజాయి మత్తులో స్నేహితుడి గొంతు కోసిన యువకుడు

గంజాయి మత్తులో స్నేహితుడి గొంతు కోసిన యువకుడు

హాలియా, వెలుగు: గంజాయి మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని బ్లేడుతో గొంతు కోసి పారిపోయాడు. నాగార్జున సాగర్ ఎస్సై సంపత్​ కథనం ప్రకారం..నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన పుట్టపాక విష్ణువర్ధన్, నల్లగంతుల నితిన్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. విష్ణువర్ధన్ స్థానిక బుద్దవనంలో సూపర్​వైజర్. 

శనివారం సాయంత్రం5 గంటలకు నితిన్... విష్ణువర్ధన్ కు ఫోన్ చేసి సాగర్​లోని ఓ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. దీంతో విష్ణువర్ధన్ అక్కడికి వెళ్లేసరికి నితిన్​మందు తాగుతున్నాడు. కొద్దిసేపటికే తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నావంటూ నితిన్​...విష్ణువర్ధన్​తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నితిన్ బ్లేడుతో విష్ణువర్ధన్ మెడ కోసి పరారయ్యాడు. విష్ణును స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.