బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లకు సిల్వర్ మెడల్స్

 బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లకు సిల్వర్ మెడల్స్

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో యువ షట్లర్ ఉన్నతి హుడా, అనీశ్ సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరి..చరిత్ర సృష్టించిన ఉన్నతి..అండర్ 17 బాలికల ఫైనల్లో థాయిలాండ్ ప్లేయర్ నరున్ రాక్ చేతిలో 18–21, 21–9, 14–21 స్కోరు తేడాతో ఓడిపోయింది. 

మొదటి గేమ్లో ఓడిన ఉన్నతి ..రెండో గేమ్లో పుంజుకుంది. ఇదే జోరుతో 21–9 తేడాతో రెండో గేమ్ను దక్కించుకుంది. ఇక చివరైన మూడో గేమ్ లో ఉన్నతి14–14తో గట్టి పోటీనిచ్చింది. అయితే కీలక సమయంలో అద్భుతమైన షాట్లు ఆడిన నరున్ రాక్..మూడో గేమ్ను 21–14తో దక్కించుకని సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 

అటు బాలుర అండర్ 15 ఫైనల్లో అనీశ్‌ ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. చాంగ్ యేహ్ చేతిలో 8–21, 24–22, 19–21తో ఓటమిపాలై సిల్వర్ను దక్కించుకున్నాడు. మరో మ్యాచ్ లో బాలుర అండర్‌–17 డబుల్స్‌ ఫైనల్లో అర్ష్‌ మహమ్మద్‌- సంస్కార్‌ సరస్వత్‌ జోడీ 13–21, 21–19, 22–24తో చైనీస్‌ తైపీ జంట చేతిలో ఓడి రజతాన్ని సొంతం చేసుకుంది.