తల్లి చనిపోయిందన్న బాధలో కూతురు ఆత్మహత్య

తల్లి చనిపోయిందన్న బాధలో కూతురు ఆత్మహత్య

తల్లి చనిపోయిందన్న బాధలో కూతురు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో జరిగింది. క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో 23 ఏళ్ల యువతి కూడా అదే హాస్పిటల్ పైనంచి దూకి చనిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఒక మహిళ క్యాన్సర్‌తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక కూతురు కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన స్నేహితులకు కూడా చెప్పింది, కానీ వారెవరూ ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. తల్లి అంత్యక్రియల పనులలో తండ్రి బిజీగా ఉండటంతో.. కూతురు అక్కడ నుంచి కనిపించకుండా పోయింది. తల్లి ఏ ఆస్పత్రిలో అయితే చనిపోయిందో.. అదే ఆస్పత్రి పైనుంచి దూకి చనిపోయింది. మూడు రోజుల వరకు ఆమె జాడ తెలియలేదు. అయితే శనివారం ఎయిమ్స్ ఆస్పత్రి సిబ్బంది ఒక గుర్తు తెలియని శవాన్ని ఆస్పత్రి పరిసరాలలో గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. వెంటనే అక్కడకు వచ్చి మృతదేహాన్ని స్వాధీన పరచుకున్నారు. చనిపోయింది క్యాన్సర్ పేషంట్ కూతురేనని నిర్ధారించుకొని.. కూతురు మరణవార్తను తండ్రికి తెలియజేశారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు.

For More News..

తెలంగాణలో ఎన్ఆర్ఐ సెల్ సరిగా లేదు

మిల్లులో ధాన్యం కోత పెడితే మాకు చెప్పండి