ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని యువతి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని యువతి ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా మృతిచెందడంతో తట్టుకోలేక యువతి గురువారం (జనవరి 25) సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.

శ్రీకాకుళం జిల్లా కు చెందని అఖిల 10 నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఓ షోరూంలో పనిచేస్తోంది.తనతోపాటు పనిచేసే మధు గౌడ్ అనే యువకుడితో ప్రేమలోపడింది. అయితే కొద్ది రోజుల క్రితం మధు గౌడ్ మృతి చెందాడు. ప్రేమించిన వ్యక్తి మృతిని తట్టుకోలేక అఖిల బ్లేడ్ చేయి కొసుకొని ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో ఈ ఘటన చోటు చేసుకంది. 

అఖిల కుటుంబీకులు వచ్చి చూడగా ఇంట్లో అప్పటికే మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

  • Beta
Beta feature