అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి.. మీ ఓటు తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి.. మీ ఓటు.. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి.. మీ ఓటు వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి.. మీ ఓటు.. మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి అని అన్నారు.
మీ ఓటు యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలని, సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలని, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలన్నారు. మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథాకానివ్వకండని, అందుకే.. ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వామ్యం కండని సూచించారు. ప్రతి ఒక్కరూ ముచ్చటగా... ఓటు హక్కును వినియోగించుకోండని అన్నారు.
మీ ఓటు..
— KTR (@KTRBRS) November 30, 2023
పరుగులు పెడుతున్న
తెలంగాణ ప్రగతికి
పునాదిగా నిలవాలి
మీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు
బంగారు బాటలు వేయాలి
మీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో
వెలుగులు కొనసాగించాలి
మీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి
వెన్నుముకగా నిలవాలి
మీ ఓటు..
మహిళల ముఖంలో
చెరగని చిరునవ్వులు నింపాలి
మీ…