ఎక్కడి నుంచి చేసినా ఓకే..
ఎంప్లాయీస్కు ఎయిర్బీఎన్బీ ఆఫర్
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్కు ఎయిర్బీఎన్బీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. జీవితాంతం ఇదే విధానంలో జాబ్ చేసుకోవచ్చని కంపెనీ సీఈఓ బ్రియాన్ చెస్కీ స్పష్టం చేశారు. ఆఫీసుకు వచ్చి పనిచేసినా అభ్యంతరం ఏమీ లేదని చెప్పారు. దేశంలో ఎక్కడ ఉన్నా, జీతాన్ని తగ్గించబోమని భరోసా ఇచ్చారు. ఫారిన్లో అయితే ఏడాదిలో 90 రోజుల వరకు ఉండి పనిచేయొచ్చని చెప్పారు. టీమ్ మెంబర్లు అప్పుడప్పుడు భేటీ అవుతారని. ఉద్యోగులు ఒక క్వార్టర్లో కనీసం వారంపాటు అయినా ఆఫీసుకు రావాలని బ్రియాన్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయని, దూరం నుంచే జాబ్ చేయడం ఈజీ అయ్యిందని అన్నారు.