ఒకప్పుడు టిక్ టాక్..ఇప్పుడు రీల్స్ అన్నట్టే మారింది వ్యవస్థ.. లైకుల కోసం ఒకడు పచ్చి కారంపొడి పచ్చి మిర్చీలు తింటే మరొకడు ఒంటి మీద దుస్తులు లేకుండా వీడియోలు చేస్తున్నారు. ఎంత మంది చూస్తే అంత వైరల్ అయినట్టు..ఎన్ని లైకులు వస్తే అంత రీచ్ వచ్చినట్టు.. అంతే కానీ తాము చేసేది కరెక్టా కాదా అనేది కూడా అవసరం లేకుండా పోయింది జనాలకు. ఇలాగే పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు ఓ వ్యక్తి ఇంతకు ఎక్కడంటే..
ఉత్తరప్రదేశ్లోని బాంద్రా జిల్లాలో 21 ఏళ్ల శివం అనే యువకుడు రీల్స్ చేద్దామని పాఠశాల బిల్డింగ్ పైకి ఎక్కి తలక్రిందులుగా వేలాడుతూ వ్యాయామం చేశాడు. కొద్ది సేపటికే అతని కాళ్లు జారడంతో కింద పడి స్పాట్ లోనే మృతి చెందాడు. మొబైల్ ఫోన్లో రీల్ను రికార్డ్ చేస్తున్న అతని స్నేహితులు భయబ్రాంతులకు గురై అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువకుడి మృతి విషయం తెలుసుకున్న యువకుడి బంధువులు విషాదంలో మునిగిపోయారు.
బాలుడి మృతితో బంధువులు రోదించడంతో పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరణించిన 21 ఏళ్ల శివమ్ తన కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేశాడు, అక్కడ నుండి వాటర్ ప్యాకెట్లు తీసుకొని పట్టణం చుట్టూ రిక్షాలో సరఫరా చేసేవాడు. అతని తండ్రి వేరే రాష్ట్రంలో కూలీగా పనిచేస్తున్నాడు.
విషయం తెలుసుకున్న అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో కాస్త నెట్టింటా వైరల్ గా మరింది. వీడియో పై నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ఒకప్పుడు టిక్ టాక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని కామెంట్ పెడుతున్నారు.