కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఇంకెప్పుడు?

కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఇంకెప్పుడు?
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేకపోతే..
  • కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం
  • ట్విట్టర్ లో వైఎస్ షర్మిల ఆగ్రహం

హైదరాబాద్: కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయింది, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు KCR సారు?  అంటై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.  చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా?  లేక ..  మీ లెక్కకు సరిపడ మరణాలు నమోదు కాలేదనా? అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. అయ్యా .. KCR సారు .. ఇప్పడికే జనం తిరగ పడుతున్నరు,   కరోనా తో రోడ్ల మీద పడ్డమని, బతుకులు ఆగమైనయని,  జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చండి.  ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి.  లేదంటే .. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమేనని వైఎస్ షర్మిల హెచ్చరించారు.