
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులను.. అప్పులపాలై సూసైడ్ చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు. గల్వాన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు, ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం తప్పు కాదన్నారు. కానీ తెలంగాణ రైతులను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాటా అని ప్రశ్నించారు.
గాల్వన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ
— YS Sharmila (@realyssharmila) March 4, 2022
తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు?1/2
మరిన్ని వార్తల కోసం: