ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా?

ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా?

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌దే బాధ్యత అన్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎంక చలనం కూడా లేదన్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్టు కెసిఆర్ ఉన్నారన్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండేదన్నారు.ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే వారా ? అంటూ ప్రశ్నించారు షర్మిల. నాయకుడికి ముందు చూపు ఉండాలన్నారు. ఎంత మంది రాష్ట్రంలో  చదువుకున్న వాళ్ళు ఉన్నారు ? ఎన్ని ఉద్యోగాలు అవసరం అవుతాయి ? ఎంతమందికి స్వయం ఉపాధికి లోన్లు ఇవ్వాలి ?ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ? ఇలా అన్ని విషయాలు తెలియాలన్నారు. సీఎంకు ముందు చూపు లేకనే ఈ సమస్య... వచ్చిందన్నారు. 

ఇన్నేళ్లకు 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని కేసీఆర్ కేవలం ప్రకటన మాత్రమే చేశారన్నారు. ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకున్నరా?  అని ప్రశ్నించారు. రుణ మాఫీ ఏమైంది ,మహిళలకు 0% వడ్డీకి రుణాలు ఏమయ్యాయి, ఉచిత విద్య ఏమైంది , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు,  మూడెకరాల భూమి ఏమయ్యాయని ప్రశ్నించారు. చదువుకున్నా నిరుద్యోగులు హమాలీలుగా, గొర్రెలకాపరులుగా, ఆటోడ్రైవర్లుగా,హోటళ్లలో పనిచేస్తూ ఉన్నారన్నారు. ఏమీ చదువుకోని  వారు ఎమ్మెల్యేల అవుతున్నారన్నారు. కూలీ నాలీ చేసుకుని బిడ్డలను కష్టపడి చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రాక  ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. 

రాజశేఖర్ రెడ్డి కేవలం అయిదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. 2004లో, 2006లో,  2008లో లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. 2008లో జంబో డీఎస్సీ పేరుతో 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో 11 లక్షల ఉద్యోగాలను ఇచ్చారన్నారు.  లక్షల మందికి స్వయం ఉపాధి చూపించారన్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా - వలిగొండ మండలం గోల్నేపల్లి పరిధిలోని బూర్లగడ్డలో  వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ రెడ్డి తల్లి శోభ...షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. 

ఇవి కూడా చదవండి:

పెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ