హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతున్నాయని చెప్పారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతూ.. కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేస్తున్నాయని పేర్కొన్నారు. ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులను చనిపోయేలా చేస్తున్నాయని మండిపడ్డారు.
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతుంటే,
— YS Sharmila (@realyssharmila) December 23, 2021
ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతూ, కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేస్తూ,
ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులను చనిపోయేలా చేస్తున్నాయి. రైతు ఆవేదన తీర్చేవారే లేరు. 1/2
రైతు ఆవేదన తీర్చేవారే లేరని షర్మిల అన్నారు. అన్నదాత చనిపోతే కనీసం వారి కుటుంబాలను ఓదార్చే దిక్కు లేదన్నారు. రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నఈ రైతు హంతక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దామని పిలుపునిచ్చారు. అందుకే ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని ఆమె ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం: