పంజాబ్ లోని లుధియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. కోర్టు కాంప్లెక్స్ లో హఠాత్తుగా బాంబు పేలడంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ తోపాటు ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, పేలుడు దెబ్బకు కోర్టు కాంప్లెక్స్ లో ఓ గోడ కూలింది. పేలుడు తర్వాత కోర్టు కాంప్లెక్స్ మొత్తం పొగ ఆవరించి ఉన్న వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
One dead, 2 injured in Ludhiana District Court explosion
— ANI Digital (@ani_digital) December 23, 2021
Read @ANI Story | https://t.co/PiROo5nihp#LudhianaBlast pic.twitter.com/NjSkuyRMi3
కోర్టు కాంప్లెక్స్ లో బాంబు పేలుడు ఘటనపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను లుథియానాకు వెళ్తున్నానని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. అయితే తమ ప్రభుత్వం అలర్ట్ గా ఉందని.. దోషులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
I am going to Ludhiana. Some anti-national elements are doing such acts as Assembly elections are nearing. The government is on alert. Those found guilty will not be spared: Punjab CM Charanjit Singh Channi on explosion at Ludhiana District Court Complex pic.twitter.com/T6trPdLr6b
— ANI (@ANI) December 23, 2021
మరిన్ని వార్తల కోసం: