108 కు ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదు

108 కు ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదు

రాష్ట్రంలో 108 లు కూడా సరిగా పనిచేయడం లేదని విమర్శించారు YSRTP చీఫ్ షర్మిల. 108 కు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదన్నారు. ఫౌంహౌజ్ లో ఉండే ముఖ్యమంత్రికి ప్రజలు కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా రాత్రి నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మర్రిగూడలో బస చేశారు షర్మిల.  క్యాంప్ దగ్గరలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆ సమయంలో 108 కు ఫోన్ చేస్తే కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు షర్మిల పాదయాత్రకు సంబంధించిన అంబులెన్సులో గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. ఇవాళ దీపావళి సందర్భంగా ఒక్కరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.