రిజర్వేషన్లపై ముస్లింలను కేసీఆర్ మోసం చేసిండు

 రిజర్వేషన్లపై  ముస్లింలను కేసీఆర్ మోసం చేసిండు

ముస్లింల రిజర్వేషన్లపై కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రిజర్వేషన్లు ఇవ్వకుండా ముస్లీంలను కేసీఆర్ మోసం చేశాడన్నారు. పాతబస్తీలో కొత్తగా ఏమైనా అభివృద్ధి జరిగిందా  అని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల్లో 57 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వక్ఫ్ భూములను కాపాడిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. ముస్లింల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు అమలుచేసిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు షర్మిల. ముస్లింలను ప్రస్తుత పాలకులు ఓటు బ్యాంకుగా చూస్తున్నారన్నారు.