హైదరాబాద్: రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలు, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. తమకు ఏ దిక్కూ లేదని అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారని.. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా దొరకు లేదని మండిపడ్డారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్ కు, మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైమ్ కూడా లేదని షర్మిల ట్వీట్ చేశారు.
రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో,ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.పంట పండక,పెట్టుబడి రాక,అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు,ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి.1/2 pic.twitter.com/X5wbQ77fZy
— YS Sharmila (@realyssharmila) December 24, 2021
రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం ఇది అని షర్మిల విమర్శించారు. అన్నదాతను అప్పులపాలు చేస్తున్న సీఎం మనకొద్దన్నారు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకు ఎందుకని క్వశ్చన్ చేశారు.
మరిన్ని వార్తల కోసం: