వైఎస్ వివేకా మర్డర్ కేసులో మరో పిటిషన్

వైఎస్ వివేకా మర్డర్ కేసులో మరో పిటిషన్

దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో పిటిషన్ దాఖలైంది. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేశారు వివేకా కూతురు సునీత. ఇప్పటికే వివేకా హత్య కేసు సీబీఐకి ఇవ్వాలంటూ.. వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్య, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. కొత్తగా నాలుగో పిటిషన్ ను వివేకా కుమార్తె సునీత వేశారు. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను చేర్చారు పిటీషినర్ సునీత. అన్ని పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఐతే.. విచారణ చివరి దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని కోర్టుకి గతంలో ప్రభుత్వం తెలిపింది.

SEE MORE NEWS

దేశ రాజధానిలో కరోనా కలకలం..

ముళ్లులాంటి కామెంట్స్​కి పూలతో ఆన్సర్ .. దటీజ్ అలియా