కాళేశ్వరంతో భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని నిస్సిగ్గుగా చెబుతున్నాడు చిన్న దొర : వైఎస్ షర్మిల

కాళేశ్వరంతో భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని నిస్సిగ్గుగా చెబుతున్నాడు చిన్న దొర : వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని మంత్రి కేటీఆర్ ఒప్పుకున్నారని చెప్పారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సగం డబ్బు కాజేసి, వేల కోట్ల కరెంటు బిల్లులకు కారణమయ్యే ప్రాజెక్టును ముంగట వేశారని, అది కూడా మూణాళ్లకే భారీ వర్షాలు, వరదల్లో మునిగిందని చెప్పారు వైఎష్ షర్మిల.