పీఎల్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓగా జరీన్

పీఎల్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓగా జరీన్

హైదరాబాద్, వెలుగు: పీఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్​ లీలాధర్ గ్రూప్) సీఈఓగా జరీన్ దారువాలా నియమితులయ్యారు.  బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమలో ఆమెకు 35 ఏళ్ల అనుభవం ఉందని పీఎల్ క్యాపిటల్​ తెలిపింది.  ఇది వరకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓ (ఇండియా సౌత్ ఆసియా)గా పనిచేశారు.  జరీన్​ నాయకత్వంలో బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం భారీగా పెరిగిందని,  వెల్త్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ -ఫోకస్డ్‌‌‌‌‌‌‌‌గా మారిందని పీఎల్​ క్యాపిటల్​ పేర్కొంది.  తమ బ్రోకింగ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ అడ్వైజరీ  సర్వీసెస్, ప్రైవేట్ క్రెడిట్, వెల్త్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వీసు వ్యాపారాలను నడిపించడంలో జరీన్ కీలక పాత్ర పోషిస్తారని ప్రకటించింది.