- బీజేపీ లో చేరిన చండూర్ జడ్పీటీసీ
- రాజగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిక
నల్గొండ, వెలుగు : చండూర్ టీఆర్ఎస్ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మంగళవారం బీజేపీలో చేరారు. హైదరాబాద్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడతల పల్లి ఉప సర్పంచ్ గంట తులశయ్య కమలం గూటికి చేరారు. కర్నాటి వెంకటేశం గతంలో కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీగా గెలిచి ఆ పార్టీలో విభేదాల కారణంగా టీఆర్ఎస్లో చేరారు. అధికార పార్టీలో లీడర్లు వ్యవహరిస్తున్న తీరు నచ్చక ప్రస్తుతం రాజ్ గోపాల్ సమక్షంలో చేరారు. కాగా, వీరిని బుజ్జగించేందుకు జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అధిష్టానం ఆయనను దూతగా పంపినా లాభం లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది.