కంపెనీల కోసం సైబర్ థ్రెట్ రీసెర్చ్ సెంటర్: ఎయిర్ టెల్ తో కలిసి నిర్మించనున్న జెడ్ స్కేలర్

కంపెనీల కోసం సైబర్ థ్రెట్ రీసెర్చ్ సెంటర్: ఎయిర్ టెల్ తో కలిసి నిర్మించనున్న జెడ్ స్కేలర్

హైదరాబాద్​, వెలుగు: క్లౌడ్ సెక్యూరిటీ ప్రొవైడర్​ జెడ్‌‌‌‌స్కేలర్​తో కలిసి ఢిల్లీలో ఏఐ, సైబర్ థ్రెట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ఎయిర్‌‌‌‌టెల్ ప్రకటించింది.

టెలికం, బ్యాంకింగ్, విద్యుత్ వంటి కీలక రంగాల భద్రతను ఇది పెంచుతుంది. దేశీయ సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ఈ పరిశోధనా కేంద్రం పనిచేస్తుంది.