
హైదరాబాద్, వెలుగు: బకాయిలు చెల్లించకుంటే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నేటి(మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ పెడ్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోషియేషన్(టీఏఎన్హెచ్ఏ) హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా బకాయిలు పేరుకుపోయాయని, దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఆర్థిక కష్టాల్లో కూరు కుపోయాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే, సోమవారం ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే, నెట్ వర్క్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లు మాత్రం బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. మొత్తం రూ.1400 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, మొత్తం క్లియర్ చేయాలని టీఏఎన్హెచ్ఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.