
సిద్దిపేట వెలుగు: జిల్లాలో రైతు భరోసా కింద 3,07,778 మంది రైతుల ఖాతాల్లో రూ.312.44 కోట్లు జమ చేసినట్లు డీఏవో రాధిక శనివారం తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 59,382 మంది రైతులకు రూ.63.601కోట్లు, దుబ్బాకలో 75,685 మంది రైతులకు రూ.72.170, గజ్వేల్ లో 85,280 మంది రైతులకు రూ.76.658, హుస్నాబాద్ లో 38,118 మంది రైతులకు రూ.43.252, జనగామలో 37,717 మంది రైతులకు రూ.43.105, మాన కొండూరులో 11,596 మంది రైతులకు రూ.13.651 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు.