నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆఫీస్లో పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆఫీస్లో  పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

నిజామాబాద్,  వెలుగు :  జిల్లా పోలీస్ ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన పోలీస్  ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయి.  సీపీ సాయిచైతన్య ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత ఠాణా ఆఫీసర్లతో ఫోన్​లో మాట్లాడారు. బాధితులకు సాయం అందేలా చూడాలని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను కలిసేందుకు ప్రజావాణిని వినియోగించుకోవాలన్నారు.  

 రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ  లేడీ కానిస్టేబుల్ అల్లం మాధురి,  హోంగార్డ్​గా పని చేస్తున్న ఆమె తండ్రి అల్లం భూమయ్యను సీపీ హాస్పిటల్​కు వెళ్లి పరామర్శించారు.  తండ్రీకూతురు టూవీలర్​పై డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వస్తుండగా సాయినగర్​ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్​ఢీకొట్టింది. దీంతో తండ్రీకుతుళ్లకు తీవ్రగాయాలు కాగా జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు.