ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్తానీ రాతల కలకలం

ఢిల్లీ మెట్రో స్టేషన్లలో  ఖలిస్తానీ రాతల కలకలం

ఢిల్లీలో మరోసారి ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు.  ఆగస్టు 27 ఉదయం ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై  ఖలిస్తాన్ కు మద్దతుగా రంగులతో  స్లోగన్స్ రాశారు. 

సెప్టెంబర్ 9,10 వ తేదీల్లో ఢిల్లీలో జీ 20 సమావేశాలు  జరగనున్న నేపథ్యంలో ఈ రాతలు కలకలం రేపుతున్నాయి. సిఖ్ ఫర్ జస్టిస్ (SFI) పేరుతో  ఖలిస్తాన్ కు మద్దతుగా ఢిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న పలు స్టేషన్లలో  వరకు రాశారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోడలపై రాతలను చెరిపివేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.