ఏపీలో  ఒక్కరోజులో 6,996 కొత్త కేసులు

ఏపీలో  ఒక్కరోజులో 6,996 కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇవాళ(మంగళవారం) ఒక్కరోజులోనే 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,996 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 మంది కరోనా బారినపడగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 కేసులు గుర్తించారు.

రాష్ట్రంలో 1,066 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తంగా  కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,514కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,66,762 మంది కరోనా నుంచి బయటపడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 36,108కి చేరింది.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కరోనా పాజిటివ్