ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇవాళ(మంగళవారం) ఒక్కరోజులోనే 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,996 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 మంది కరోనా బారినపడగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 కేసులు గుర్తించారు.
రాష్ట్రంలో 1,066 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,514కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,66,762 మంది కరోనా నుంచి బయటపడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 36,108కి చేరింది.
Andhra Pradesh reports 6,996 recoveries, 1066 recoveries and 5 deaths in the last 24 hours.
— ANI (@ANI) January 18, 2022
Active cases in the state stand at 36,108. pic.twitter.com/WwCvDyVScl
మరిన్ని వార్తల కోసం..