ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి

ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై  గుర్తు తెలియని వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు.  దీంతో తీవ్రగాయలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్లు రాజు,  వినయ్ లు ఓ కేసు దర్యాప్తు కోసం బస్తీకి వెళ్లాడు. అక్కడ ఏమైందో ఏమో కానీ గుర్తు తెలియని ఓ వ్యక్తి  తల్వార్తో వారిపై దాడి చేశాడు. 

రాజు అనే కానిస్టేబుల్ను దుండగుడు ఛాతీలో పొడవగా, వినయ్ కు తలపై గాయాలయ్యాయి.  తీవ్రగాయాల పాలైన వీరిని వెంటనే స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.