పాపన్నపేటలో పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ కోసం ధర్నా

పాపన్నపేటలో పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ కోసం ధర్నా

పాపన్నపేట, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్​ వెంటనే విడుదల చేయాలని పాపన్నపేటలో సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రూ.8500 కోట్ల స్కాలర్​షిప్​​బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వానికి వైన్స్ టెండర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదన్నారు. 

బకాయిలు విడుదల చేయకుంటే కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వమని హెచ్చరించారు. స్కాలర్షిప్​ ప్రభుత్వ భిక్ష కాదు విద్యార్థుల హక్కు అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, వినయ్, విక్రం, వంశీ,  నిఖిల్, ఆదిలక్ష్మి, అశ్విని, సుజాత, శివ, విఘ్నేశ్వర్,  ప్రవీణ్, చరణ్ పాల్గొన్నారు.

జహీరాబాద్: స్కాలర్​షిప్స్​, ఫీజు రీయింబర్స్​మెంట్స్​వెంటనే చెల్లించాలని డిమాండ్​చేస్తూ సోమవారం వివిధ కాలేజీల విద్యార్థులు జహీరాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళను చేశారు. అనంతరం ఆర్డీవో ఆఫీసుకు ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం  అందజేశారు.