పంజాగుట్ట శ్మశాన వాటికలో .. ముగిసిన చంద్రమోహన్​ అంత్యక్రియలు

 పంజాగుట్ట శ్మశాన వాటికలో .. ముగిసిన చంద్రమోహన్​ అంత్యక్రియలు

పంజాగుట్ట, వెలుగు: సినీ నటుడు చంద్రమోహన్​ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో సోమవారం పూర్తయ్యాయి. ఫిల్మ్​నగర్​లోని ఆయన ఇంటి నుంచి అంతమ యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు నటుడు వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరి రావు, మాదాల రవి పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్​ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన సోదరుడు మల్లంపల్లి దుర్గా ప్రసాద్​ చేతుల మీదుగా అంత్యక్రియ లు జరిగాయి. అనారోగ్యంతో  రెండ్రోజుల క్రితం చంద్రమోహన్​ మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తె మధుర మీనాక్షి ఇండియాకు రావడానికి ఆలస్యం కావడంతో అంత్య క్రియలు సోమవారం నిర్వహించారు. చంద్ర మోహన్​కు ఇద్దరు కుమార్తెలు కాగా, ఒకరు అమెరికాలో సైకాలజిస్టుగా, మరొకరు చెన్నైలో సెటిలయ్యారు.