
- అధికారులను ఆదేశించిన అడిషనల్ కలెక్టర్
జైనూర్, వెలుగు: వర్షాకాలంలో జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశిం చారు. బుధవారం జైనూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పారిశుధ్యాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఫాగింగ్ మెషీన్ను అందుబాటులో ఉంచాలని, తాగునీటి బావుల్లో క్లోరినేషన్ పనులు నిరంతరం చేయాలని అధికారులను ఆదేశించారు.
అత్యవసర పరిస్థి తుల్లో గర్భిణులను ఆస్పత్రులకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్ చేయాలన్నారు. స్పెషల్ ఆఫీసర్ గుణవత్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో మోహన్, మేజర్ గ్రామాపంచాయతీ ఈవో ఆనంద్ రావు, ఈజీఎస్ ఏపీవో నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.