V6 News

పర్యాటక కేంద్రాలను  సందర్శించిన ఆఫీసర్లు

పర్యాటక కేంద్రాలను  సందర్శించిన ఆఫీసర్లు

వెంకటాపూర్​(రామప్ప)/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా పర్యాటక కేంద్రాలను సోమవారం ఎయిర్​ ఫోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఆఫీసర్లు సందర్శించారు. ముందుగా రామప్ప టెంపుల్​ను ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆప్ ఇండియా సంస్థ ఈడీ ఎస్ కె.గుప్తా, జేఈ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎంలు ఉమేశ్​కుమార్, పర్వింద్ర తివారి, డీజీఎం వసీం, ఏజీఎం గోపాలకృష్ణ, బేగంపేట విమానాశ్రయ అధికారులు, సిబ్బంది సందర్శించి, ఆలయంలో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో ఇమ్మడి భాస్కర్​ వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఓరుగల్లు కోటను వారు సందర్శించారు. ఆయా పర్యాట కేంద్రాల గురించి గైడ్స్​ వారికి వివరించారు.