టార్గెట్.. ఇందూరు మున్సిపోల్ లో ప్రధాన పార్టీల ఫోకస్..బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్న కవిత

టార్గెట్.. ఇందూరు మున్సిపోల్ లో ప్రధాన పార్టీల ఫోకస్..బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్న కవిత
  •  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ పీసీసీ చీఫ్​మహేశ్​గౌడ్ 
  • ఈసారి చాలెంజ్ గా తీసుకున్న బీజేపీ ఎంపీ అర్వింద్
  • మున్సిపల్ పదవుల్లో కీరోల్ కోసం మజ్లిస్ ​వ్యూహాలు
  • బీఆర్ఎస్​ను దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్న కవిత

నిజామాబాద్,  వెలుగు :  నిజామాబాద్​ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గెలుపును ప్రధాన పార్టీలు టార్గెట్  చేశాయి.  టీ పీసీసీ చీఫ్​మహేశ్​గౌడ్​సొంత జిల్లా కావడంతో పాటు కాంగ్రెస్​సీనియర్​లీడర్లు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్ అలీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. 

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​కూడా సవాల్ గా తీసుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పైనే ఆయన పూర్తిగా దృష్టి సారించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తలెత్తిన పరిణామాలతో ఆ పార్టీని దెబ్బతీసేందుకు జిల్లా కోడలు, జాగృతి చీఫ్​కవిత పావులు కదుపుతున్నారు.  మరోవైపు మజ్లిస్​ కీ రోల్ ​పోషించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

బీజేపీని కట్టడి చేసేందుకు.. ​

టీ పీసీసీ ప్రెసిడెంట్​గా మహేశ్​ గౌడ్ ​బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ సింబల్ ​లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​మద్దతుదారులు జిల్లాలో 80 శాతం మంది గెలిచారు. మున్సిపల్​ఎన్నికలు  సింబల్​ కావడంతో ఆయన చాలెంజ్ గా తీసుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్​పై కాంగ్రెస్​ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 

2005లో  నిజామాబాద్​ కార్పొరేషన్​గా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్​గెలిచింది. అప్పటి ఏపీసీసీ చీఫ్​డి.శ్రీనివాస్​పెద్ద కొడుకు డి.సంజయ్​మేయర్​అయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్​జెండా ఎగరవేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ పవర్ లో ఉంది.  జిల్లాకు చెందిన మహేశ్ పార్టీ చీఫ్​గా ఉన్నారు. దీంతో జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్​తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్​మున్సిపాలిటీలను సవాల్​గా తీసుకున్నారు. 

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్​అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణలు అనుకూలిస్తే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతో మహేశ్ గౌడ్ ఉన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ను​చేజిక్కించుకుంటే, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నా రు. 

ఎంపీ అర్వింద్​ను కట్టడి చేయడానికి  మున్సిపల్ ఎన్నికలను వేదిక చేసుకుని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​అలీ సక్సెస్​వ్యూహాలు పన్నుతున్నారు. పైరవీలకు చోటు లేకుండా గెలుపు గుర్రాలనే పోటీ చేయించాలని ఫిక్స్​అయ్యారు. ఇప్పటికే కొందరు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరారు. 

గతంలో పార్టీ చీఫ్​గా పనిచేసిన మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మున్సిపల్​ఎన్నికలకు నిజామాబాద్​లోక్ సభ సెగ్మెంట్​ ఇన్​చార్జ్​గా నియమితుల య్యారు. ఆయన సారథ్యంలో గెలుపు వ్యూహాలను రూపొందిస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్ల లో  మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగరేయాలని 

గత మున్సిపల్ ఎన్నికల్లో మేయర్​కుర్చీ స్వల్ప తేడాతో బీజేపీకి దూరమైంది. కార్పొరేషన్​లోని 60 డివిజన్లలో 28 గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించింది. అయినా మేయర్ పదవిని దక్కించుకోలేపోయింది. బీఆర్ఎస్​13 మంది కార్పొరేటర్లను మాత్రమే గెలిచినా..  మజ్లిస్​కు చెందిన16 మంది కార్పొరేటర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకుంది. 

అప్పటి ఎక్స్​అఫిషియో సభ్యులు ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, డి.రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్​గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్​ ఓట్లతో మేయర్​ పీఠం దక్కించుకుంది.  డిప్యూటీ మేయర్​ పోస్టును మజ్లిస్​కు ఇచ్చింది.  ప్రస్తుత ఎన్నికల్లో గతంకంటే అధిక డివిజన్లను గెలుచుకుని కార్పొరేషన్​లో కాషాయ జెండా ఎగరేయాలని ఎంపీ అర్వింద్​ధీమాతో ఉన్నారు. 

జిల్లా బీజేపీ పాలిటిక్స్​ అర్వింద్​కు ముందు ఆయనకు తర్వాతగా మారాయి. వ్యక్తిగతంగా తన ఇమేజ్​పెంచి పార్టీని విస్తరించే చాన్స్ ను ఆయన మున్సిపల్ ఎన్నికలను పరిగణిస్తున్నారు. ఆర్మూర్ బీజేపీ  ఎమ్మెల్యే పైడి రాకేశ్​సొంత మున్సిపాలిటీతోపాటు బోధన్​పై కూడా దృష్టిసారించారు. కాగా.. పార్టీలో కొత్తగా జాయిన్​ అయినవారిని పోటీ చేయిస్తారనే  ప్రచారంతో  సీనియర్లు నారాజ్​అవుతున్నారు.  ఇరువర్గాల మధ్య సమన్వయం కష్టతరంగా మారింది. 

గెలిచే స్థానాలపైనే మజ్లిస్​ ఫోకస్​

జిల్లా కేంద్రమైన నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు మూడు మున్సిపాలిటీల్లోని అన్ని డివిజన్లలో కాకుండా గెలిచే సీట్లపైనే మజ్లిస్​ప్రధానంగా ఫోకస్​ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్​పర్సన్, వైస్​చైర్​పర్సన్ పదవుల ఎన్నిక సమయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాలనే వ్యూహాలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. 

గత ఎన్నికల్లో నిజామాబాద్​లో 16 డివిజన్లు గెలుపొందడంతో పాటు  మరో నాలుగు చోట్ల గెలిచేందుకు ప్లాన్​చేశారు. 2014 ఎన్నికల్లో కూడా నిజామాబాద్​మేయర్​పదవిని మజ్లిస్​సపోర్ట్​తో బీఆర్ఎస్ దక్కించుకుంది. బోధన్​మున్సిపల్​ చైర్మన్ కుర్చీని మజ్లిస్​కు బీఆర్ఎస్ వదులుకుంది.  కానీ.. అప్పటి లోకల్ ఎమ్మెల్యే షకీల్​ రాజకీయ వ్యూహాలు పన్ని  మజ్లిస్​కు పదవి దక్కకుండా చేశారు.  చైర్మన్​ సీటును సైతం బీఆర్ఎస్​లాగేసుకుంది. 

వైస్ చైర్మన్ పోస్టుతో మజ్లిస్​సరిపెట్టుకుంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్, బోధన్​లో కీలకంగా వ్యవహరించి సత్తా చాటాలని మజ్లిస్​స్కెచ్​వేసింది.  కాగా.. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో తమ గెలుపు ఖాయమని​కాంగ్రెస్​ భావిస్తోంది.

బీఆర్ఎస్​ అడ్రస్ గల్లంతు చేసేందుకు..

పదేండ్లు నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ఆ పార్టీ​వీక్​అయింది. బాల్కొండ సెగ్మెంట్​లో మాత్రమే పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి ఉన్నారు. 

ఆయన తన సెగ్మెంట్ పరిధిలోని భీంగల్​మున్సిపాలిటీపైనే దృష్టి పెట్టారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్​లో క్లిష్టపరిస్థితు లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్​కు అడ్రస్​లేకుండా చేయాలని కవిత వ్యూహంతో పావులు కదుపుతున్నారు.  అందుకు సెలెక్టివ్​స్థానాల్లో సింహం గుర్తుపై తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు.