వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ సెమీస్‌‌‌‌లోనే పరాజయం పాలైంది:అంతిమ్‌‌‌‌ పంగల్‌‌‌‌

వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ సెమీస్‌‌‌‌లోనే పరాజయం పాలైంది:అంతిమ్‌‌‌‌ పంగల్‌‌‌‌
  • అంతిమ్​..సెమీస్‌‌‌‌తోనే సరి

బెల్‌‌‌‌గ్రేడ్‌‌‌‌: తొలి రౌండ్​లోనే వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ను ఓడించి ఆశలు రేకెత్తించిన ఇండియా యంగ్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ అంతిమ్‌‌‌‌ పంగల్‌‌‌‌.. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ సెమీస్‌‌‌‌లోనే పరాజయం పాలైంది. అయినా పారిస్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 53 కేజీల సెమీస్​లో అంతిమ్‌‌‌‌ 4–5తో వనేసా కల్‌‌‌‌జిన్‌‌‌‌స్కాయ (బెలారస్‌‌‌‌) చేతిలో ఓడింది. అంతిమ్​ ఇప్పుడు బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ కోసం పోటీ పడనుంది. 

Also Read : - లింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా
 

ఇందులో నెగ్గితే పారిస్​ బెర్త్​ లభిస్తుంది. ఒకవేళ ఓడినా..   మరో  బ్రాంజ్​ మెడల్​ బౌట్​లో ఓడిన రెజ్లర్​తో జరిగే క్లాసిఫికేషన్​ పోరు​లో గెలిచినా పారిస్​కు క్వాలిఫై అవుతుంది.  కాగా, తొలి రౌండ్‌‌‌‌లో 3–2తో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఒలివా డొమ్నిక్‌‌‌‌ పర్రిష్‌‌‌‌ (అమెరికా)పై గెలిచిన అంతిమ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో9–6తో మలెషేవాపై నెగ్గింది.  ఇతర బౌట్లలో మనీషా (62 కేజీ), ప్రియాంక (68 కేజీ), జ్యోతి (72 కేజీ) తొలిరౌండ్స్‌‌‌‌లోనే ఓడారు.