
-
అంతిమ్..సెమీస్తోనే సరి
బెల్గ్రేడ్: తొలి రౌండ్లోనే వరల్డ్ చాంపియన్ను ఓడించి ఆశలు రేకెత్తించిన ఇండియా యంగ్ రెజ్లర్ అంతిమ్ పంగల్.. వరల్డ్ చాంపియన్షిప్ సెమీస్లోనే పరాజయం పాలైంది. అయినా పారిస్ ఒలింపిక్ బెర్త్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. బుధవారం జరిగిన విమెన్స్ 53 కేజీల సెమీస్లో అంతిమ్ 4–5తో వనేసా కల్జిన్స్కాయ (బెలారస్) చేతిలో ఓడింది. అంతిమ్ ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడనుంది.
Also Read : - లింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా
ఇందులో నెగ్గితే పారిస్ బెర్త్ లభిస్తుంది. ఒకవేళ ఓడినా.. మరో బ్రాంజ్ మెడల్ బౌట్లో ఓడిన రెజ్లర్తో జరిగే క్లాసిఫికేషన్ పోరులో గెలిచినా పారిస్కు క్వాలిఫై అవుతుంది. కాగా, తొలి రౌండ్లో 3–2తో వరల్డ్ చాంపియన్ ఒలివా డొమ్నిక్ పర్రిష్ (అమెరికా)పై గెలిచిన అంతిమ్ క్వార్టర్స్లో9–6తో మలెషేవాపై నెగ్గింది. ఇతర బౌట్లలో మనీషా (62 కేజీ), ప్రియాంక (68 కేజీ), జ్యోతి (72 కేజీ) తొలిరౌండ్స్లోనే ఓడారు.