అరుణ్ సాగర్ అవార్డుల ప్రదానం

అరుణ్ సాగర్ అవార్డుల ప్రదానం

ఖైరతాబాద్, వెలుగు: అరుణ్ సాగర్ స్మారకార్థం ఆయన స్నేహితులు ట్రస్టు ఏర్పాటు చేసి, అవార్డులు అందజేయడం అభినందనీయమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాలను ప్రదానం చేశారు. 2022కి గాను సాహిత్యంలో కవి ప్రసాదమూర్తికి, జర్నలిజంలో ఈనాడు ఎడిటర్​ నాగేశ్వరరావుకు అవార్డులు అందజేశారు. జర్నలిస్టులకు అరుణ్ సాగర్ స్ఫూర్తి అని నాగేశ్వరరావు అన్నారు. అవార్డు కింద అందజేసిన డబ్బును అరుణ్ సాగర్ బిడ్డ చదువు కోసం ఇచ్చారు.

‘‘నేను కుటుంబంతో కంటే అరుణ్ సాగర్​తో గడిపిన రోజులే ఎక్కువ. ఆయన ఎప్పుడూ మనకేప్పుడు అవార్డులు వస్తయ్ అంటుండేవాడు. అతనే అవార్డుగా మారతాడని అనుకోలేదు” అని ప్రసాదమూర్తి అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.