
- బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు
మంచిర్యాల, వెలుగు: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ఐఏఎస్చిరంజీవులు కోరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీసీ చైతన్య సదస్సులో ఆయన చీఫ్గెస్ట్గా పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్రక్షణ లేకపోతే బీసీ రిజర్వేషన్ బిల్లు నిలబడదని, అందులో చేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేని అన్నారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. జాతీయ స్థాయిలో కులగణనను సమర్థంగా పూర్తి చేయాలని కోరారు.
50 శాతం రిజర్వేషన్ సీలింగును రద్దు చేయించేందుకు బీసీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీ బడి నిర్వాహకులు పిడికిలి రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వీరస్వామి, అవ్వారు వేణుకుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బీసీ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని కోరారు.
సదస్సులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలకంఠేశ్వర్ గౌడ్, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కార్యదర్శి వేముల అశోక్, సీనియర్ అడ్వొకేట్ కర్రె లచ్చన్న, బీజేపీ నేత మధుసూదన్ రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.