విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి : వారాల మహేశ్‌‌కుమార్

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి : వారాల మహేశ్‌‌కుమార్

జీడిమెట్ల, వెలుగు: సూరారం లక్ష్మీనగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్తు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు వారాల మహేశ్‌‌కుమార్ అధికారులను కోరారు. శుక్రవారం ఆయన కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్​ వైర్ల సమస్య గురించి  స్థానికులతో కలిసి విద్యుత్​ ఏఈ సాయికుమార్​కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని నెలలుగా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఇబ్బంది పెడుతోందని, పలు వీధుల్లో ప్రమాదకరంగా విద్యుత్​ తీగలు కిందకి వేలాడుతున్నాయని చెప్పారు.