బ్రిడ్జి నిర్మించాలని వాగులో బీజేపీ నేతల జలదీక్ష

బ్రిడ్జి నిర్మించాలని వాగులో బీజేపీ నేతల జలదీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా: ఏటా వర్షా కాలంలో వాగు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో రాకపోకలు నిలిచిపోతుండడంతో సహించలేక గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్నారు. బీజేపీ నేతల ఆధ్వర్యంలో వాగు నీటిలోనే కూర్చుని దీక్ష చేపట్టారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ దగ్గర పెద్దవాగులో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన జల దీక్ష సంచలనం సృష్టించింది. 

బ్రిడ్జి నిర్మించే వరకు పోరాటం కొనసాగుతందని  జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ప్రకటించారు. పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని.. ఫలితంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిలో కూర్చోని నిరసన కొనసాగిస్తున్న బీజేపీ నాయకులను దీక్ష విరమింప చేసేందుకు పోలీసులు చర్చలు జరిపారు.

అధికారులు లేదా నేతల నుండి స్పష్టమైన ప్రకటన రావాలని పట్టుపట్టి దీక్ష విరమించేందుకు నిరాకరించారు. వాగునీటిలో కూర్చుని  దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.