నర్సంపేట మున్సిపాలిటీలో గెలుపు మనదే : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి

నర్సంపేట మున్సిపాలిటీలో గెలుపు మనదే : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి

నర్సంపేట/ నల్లబెల్లి, వెలుగు: నర్సంపేట మున్సిపాలిటీలో గెలుపు మనదేనని బీఆర్ఎస్​ సీనియర్​ లీడర్, ​మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి అన్నారు. నర్సంపేట టౌన్​లోని సర్వాపురం 5వ వార్డుకు చెందిన బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్​ శీలం రాంబాబు మంగళవారం మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 17వ వార్డుకు చెందిన 35 మంది ముస్లీం మైనార్టీ యువకులు బీఆర్ఎస్​లో చేరారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని పలువురు బీజేపీ లీడర్లు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువాలు
 కప్పుకున్నారు. 

నియోజకవర్గ కో ఆర్డినేటర్​గా రవీందర్​రావు

బీఆర్​ఎస్​ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్​గా కేటీఆర్​ ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్​రావును నియమిస్తూ పెద్ది ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు మంగళవారం నియామక పత్రాలను రవీందర్​రావుకు అందజేశారు.