- మళ్లీ ఇంకోసారి ఆ మాట మాట్లాడితే చెప్పుతో కొడతా: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఏపీతో జల ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మళ్లీ అలా మాట్లాడితే చెప్పుతో కొడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి పైలట్లతో పరిచయాలున్నాయి కాబట్టి.. ఆయన వాళ్లను పట్టుకొచ్చి ఎస్ఎల్బీసీ సర్వేలు చేయిస్తా అంటున్నారు.
2013లో కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులవారీగా నీళ్లు కేటాయించారు. అప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఇది అప్పటి మీటింగ్ మినిట్స్లోనే ఉంది’’ అని జగదీశ్ చెప్పారు. ఎస్ఎల్బీసీ కోసం సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా మంత్రులు హెలికాప్టర్ సర్వేలు చేశారని, రాజకీయ నాయకులు టెక్నికల్ సర్వే చేయడం ఇదే మొదటిసారన్నారు. ఎస్ఎల్బీసీ విషయంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందన్నారు.
