- మంచిర్యాల జేసీ ప్రచారం
- జాబ్స్ ఇప్పిస్తానంటూ రూ.80 లక్షలు వసూల్
- బాధితుల కంప్లైట్తో నిందితుడి అరెస్ట్
మంచిర్యాల, వెలుగు: అతడు బీటెక్ స్టూడెంట్. సూటుబూటు వేసుకొని ఖరీదైన కార్లలో తిరుగుతూ ఐఏఎస్ఆఫీసర్గా చెప్పుకొన్నాడు. గవర్నమెంట్జాబ్స్ఇప్పిస్తానని పలువురి దగ్గర రూ.80 లక్షలు దండుకున్నాడు. ఈ నకిలీ ఐఏఎస్చేతిలో మోసయిన బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కటకటాలపాలయ్యాడు. మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం ప్రెస్మీట్నిర్వహించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లేఖలపల్లికి చెందిన బర్ల లక్ష్మీనారాయణ(22) హైదరాబాద్ లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ఇయర్ చదువుతున్నాడు. నిరుడు రైల్వేలో జేఈ ఎగ్జామ్రాసి జాబ్ రాకున్నా వచ్చినట్టు చెప్పుకున్నాడు. అది నిజమని నమ్మిన గ్రామస్తులు సన్మానాలు చేశారు. దీంతో అతడికి ప్రజలను సులువుగా మోసం చేయవచ్చనే ఆలోచన కలిగింది. బీటెక్ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరున్న ఎస్బీఐ కార్డ్స్డివిజన్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. లాక్డౌన్ టైంలో నిరుడు మార్చి నుంచి జూన్ వరకు గ్రామంలోనే ఉన్నాడు. జూన్, సెప్టెంబర్ మధ్య పలుసార్లు బీర్పూర్కు చెందిన రమేశ్ కారును రెంట్తీసుకొని సికింద్రాబాద్వెళ్లాడు. తాను మంచిర్యాల రైల్వేస్టేషన్లో డీఈగా పనిచేస్తున్నానని, సివిల్స్ రాశానని, త్వరలోనే రిజల్ట్ వస్తుందని రమేశ్తో చెప్పాడు. తర్వాత అతడికి నెలకు రూ.25 వేలు చెల్లించి డ్రైవర్గా పెట్టుకున్నాడు. డిసెంబర్లో ఐఏఎస్కు సెలక్ట్ అయ్యానని, మంచిర్యాలలో జాయింట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారని చెప్పాడు. ఆదిత్య ఎన్క్లేవ్లోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కు తీసుకొని అందులోకి మకాం మార్చాడు. కలెక్టర్అనే నేమ్ప్లేట్తయారు చేయించుకోవడమే కాకుండా వెహికల్కు పోలీస్సైరన్పెట్టుకున్నాడు. రమేశ్ను పర్మినెంట్ చేస్తున్నానని చెప్పి అతడి జీతం రూ.45 వేలకు పెంచాడు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లికి చెందిన మహేందర్ను పీఏగా పెట్టుకున్నాడు. అలా తాను ఐఏఎస్ఆఫీసర్నని రమేశ్, మహేందర్ను నమ్మించాడు. తన కోటాలో 20 నుంచి 30 మందికి గవర్నమెంట్జాబ్స్ఇప్పిస్తానని, అందుకు రూ.3-5 లక్షలు ఖర్చవుతుందని, మీకు తెలిసినవారు ఉంటే చెప్పాలని సూచించాడు. దీంతో వారిద్దరు బంధుమిత్రులను లక్ష్మీనారాయణ దగ్గరకు తీసుకొచ్చారు. వారి సర్టిఫికెట్లు పరిశీలించి త్వరలోనే జాబ్స్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఇటీవల తాళ్లపల్లి రమేశ్, శ్వేత కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్, మార్చి మధ్యలో 29 మంది దగ్గర దాదాపు రూ.80 లక్షలు వసూలు చేసినట్టు డీసీపీ చెప్పారు. ఆ పైసలతో రెండు కార్లు, బుల్లెట్, జగిత్యాలలో ఒక ఇల్లు, ఓపెన్ శ్లాబ్కొన్నాడని, మిగతా డబ్బులను విలాసాలకు వాడుకున్నాడని చెప్పారు. ఎంజీ హెక్టార్, టాటా నెక్సాన్కార్లు, రాయల్ఎన్ఫీల్డ్బైక్, బాధితుల సర్టిఫికెట్లు, కోర్టు డ్రెస్, నేమ్ప్లేట్ రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.