వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి.. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్​ నేతల సంబురాలు

వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి.. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్​ నేతల సంబురాలు

వెలుగు, నెట్​వర్క్: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు, అభిమానులు, మాల సంఘం బాధ్యులు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ఎదుట, బెల్లంపల్లిలోని కాకా వెంకటస్వామి విగ్రహం వద్ద, మందమర్రిలోని పాత బస్టాండ్​ఏరియాలో, భీమారం, జైపూర్​మండల కేంద్రాల్లో, నస్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీలో కాంగ్రెస్, అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. దండెపల్లి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. 

ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించిన సీఎం రేవంత్ ​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమణాస్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్​కు తరలివెళ్లారు. మాల సంఘం ఆదిలాబాద్ ​జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్​ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్​లో మంత్రి వివేక్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.