
వెలుగు, నెట్వర్క్: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మాల సంఘం బాధ్యులు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ఎదుట, బెల్లంపల్లిలోని కాకా వెంకటస్వామి విగ్రహం వద్ద, మందమర్రిలోని పాత బస్టాండ్ఏరియాలో, భీమారం, జైపూర్మండల కేంద్రాల్లో, నస్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీలో కాంగ్రెస్, అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. దండెపల్లి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమణాస్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివెళ్లారు. మాల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్లో మంత్రి వివేక్ను కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.