కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

 కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
  • మండిపడ్డ సీఐటీయూ, జేఏసీ సంఘాలు

కోల్​బెల్ట్, వెలుగు: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జులై9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో సక్సెస్ చేయాలని సీఐటీయూ ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి కోరారు. రామకృష్ణాపూర్​లోని సీఐటీయూ యూనియన్​ఆఫీస్​లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమ్మెపై ముద్రించిన బుక్స్​ను రిలీజ్ చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసేలా కార్మిక చట్టాలను కుదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాలన్నారు. ఆలిండియా కోల్ వర్కర్ ఫెడరేషన్ ఆఫీస్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యానికి కుట్ర

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కు అప్పగించే విధానాలను బీజేపీ సర్కార్​మానుకోవాలని  జేఏసీ కార్మిక సంఘాల లీడర్లు డిమాండ్​ చేశారు. మందమర్రిలోని హెచ్​ఎంఎస్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్, ఐఎఫ్​టీయూ, టీఎన్టీయూసీ లీడర్లు మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాస్తూ 40 చట్టాలను కుదించి 4కోడ్​లుగా మార్చి కార్మిక రంగానికి కేంద్ర ప్రభుత్వం తీరని నష్టం చేస్తోందన్నారు. 

కేంద్రం విధానాలతో సింగరేణి మనుగడకు విఘాతం కలుగుతోందని, కార్మికరంగానికి నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు జులై 9న జరిగే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు. సమావేశంలో లీడర్లు జె.శ్రీనివాస్, టి.శ్రీనివాస్, మణిరాంసింగ్, ఎర్ర శ్రీనివాసరెడ్డి, సదానందం, జెల్లి రాజేశ్, ఎండీ జాఫర్, సురేందర్, మనోహర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు