సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన 17వ కామన్ రివ్యూ మిషన్ బృందం సమావేశానికి అధ్యక్షత వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఈ వైద్య బృందం ఈ నెల 3 నుంచి 5 వరకు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిందన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, పటాన్చెరు ఏరియా హాస్పిటల్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్, సదాశివ్ పేట సీహెచ్సీ, ఆత్మకూరు, కంగ్టి, ఆర్సీ పురం ప్రాథమిక కేంద్రాలు, మార్క్స్ నగర్ యూపీహెచ్సీ, ఇందిరానగర్ బస్తీ దవాఖాన, ఆయుష్ డిస్పెన్సరీలను సందర్శించి వివరాలు సేకరించిందని పేర్కొన్నారు.
ఈ బృందానికి టీమ్ లీడర్గా డాక్టర్ అనురాధ మేడోజు వ్యవహరించారన్నారు. సభ్యులుగా డాక్టర్లు సంతోష్ నాయక్, రంజన్ దాస్, కవిత చౌదరి, అరుణ్ శర్మ, పర్వీన్ సుల్తానా ఉన్నారని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్వో నాగ నిర్మల, జీజీహెచ్సూపరింటెండెంట్ మురళీకృష్ణ , డీసీహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
