- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి కోతలు మూడు రోజులపాలు వాయిదా వేసుకుంటే మంచిదని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి రైతులకు సూచించారు. సోమవారం రెవెన్యూ శాఖ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వాతావరణ మార్పులపై అన్నదాతల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతుల నుంచి కాంటా పెట్టిన వడ్ల బస్తాలు రైస్ మిల్లుకు చేరేలా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా టర్ఫాలిన్లు సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. పేమెంట్లు ఆలస్యం కాకుండా ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్లో నమోదు చేయాలన్నారు.
సోయాబీన్ కొనుగోలుకు 12 సెంటర్లు..
జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోలుకు 12 సెంటర్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం వాటిని రైతులకు అందుబాటులో పెట్టాలన్నారు. మక్కజొన్న కొనుగోళ్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. లోపాలులేని ఓటర్ లిస్టు రూపకల్పన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ప్రయారిటీ కింద తీసుకోవాలని, మ్యాపింగ్పై అలర్ట్గా ఉండాలన్నారు. 2002 ఓటర్ లిస్టును 2025 లిస్టుతో క్రాస్ చెక్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
పక్క రాష్ట్రం పంట రాకుండా నిఘా..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పంట కొనుగోళ్లు ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్కు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వడ్లు, సోయాబీన్, కందులు, పెసర్లు రాకుండా నిఘా పెట్టాలని, కపాస్ కిసాన్ యాప్ వినియోగించి పత్తి కోనుగోళ్లు చేయాలని పేర్కొన్నారు.
