కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎమ్మెల్యే వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, ఆయన బండారం బయటపెడతామని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. మంగళవారం పీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్రెడ్డి, లైబ్రరీ జిల్లా చైర్మర్ మద్ది చంద్రకాంత్రెడ్డి, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ చేజారిందన్న మనోవేదనతో ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
షబ్బీర్అలీపై ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. షబ్బీర్అలీ, వారి కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించి భూములు కొన్నారు తప్పా ఎవరినీ బెదిరించి కబ్జాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే కబ్జా చిట్టాలను బయట పెడతామని హెచ్చరించారు. రిటైర్డు ఉద్యోగుల భూమి కబ్జా చేశారని ఆరోపించారు. కర్షక్ విద్యా సంస్థల భూములు ఇంజినీరింగ్ కాలేజీకి దారాదత్తం చేశారన్నారు. దమ్ముంటే సీఎస్ఐ గ్రౌండ్కు ఎమ్మెల్యే రావాలని సవాల్విసిరారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చాలని డిమాండ్చేశారు.
