
- కరోనా కేసులు పెరుగుతుండడం వల్లే భక్తుల దర్శనాలు రద్దు
హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆలయాల్లో దర్శనం కోసం భక్తులు భారీగా బారులు తీరే అవకాశాలుండడంతో ఆలయ కమిటీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లలిబర్టీ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం, చికడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, బిర్లా మందిర్ లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల దర్శనాలకు అనుమతి లేదని ఆలయ కమిటీలు ప్రకటించాయి.