న్యూఢిల్లీ: బిజినెస్ను పెంచడంలో భాగంగా ఇతర కంపెనీల్లో వాటాలు కొనడానికి రెడీగా ఉన్నామని క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ ప్రకటించింది. ఇందుకోసం బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నామని సంస్థ సీఈఓ శామ్బ్యాంక్మన్ ఫ్రైడ్ ప్రకటించారు.
ఇందుకోసమే ఇటీవల రెండు బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించినట్టు వెల్లడించారు. కంపెనీ లాభాల్లో నడుస్తోందని, ఇతర సంస్థల్లో వాటాలను లేదా కంపెనీలను కొనేందుకు రెడీగా ఉన్నామని వివరించారు. ఎఫ్టీఎక్స్ ఈ ఏడాది జనవరిలో 400 మిలియన్ డాలర్లు సేకరించింది. మరో 400 మిలియన్ డాలర్లూ పెట్టుబడిగా అందాయి.
ఇవి కూడా చదవండి
2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు
ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి