జనగామ/ రాయపర్తి, వెలుగు: తుఫాన్ దాటికి నష్టపోయిన పంటలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. సోమవారం జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బైక్పై కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లోని పొలాలకువ వెళ్లి పంటలను పరిశీలించారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు, ఊకల్ శివారులోని కలెక్టర్ సత్యశారద దెబ్బతిన్న పంటలు, కాజువేల వద్ద ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని చెప్పారు.
